పార్వతీపురం ఐటీడీఏలో భాషా పండిట్లకు అప్ గ్రేడ్ ఉత్తర్వులు ఇవ్వాలని గిరిజన సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి పాలక రంజిత్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. భాషా పండిట్లకు పాఠశాల సహాయకులుగా పదోన్నతులు కల్పించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని కానీ పార్వతీపురం ఐటీడీఏలో ప్రక్రియ ముందుకు సాగడం లేదని అన్నారు.