E.G: రేపటి నుంచి ప్రారంభం కానున్న జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని గోపాలపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జ్ దొడ్డికర్ల సువర్ణ రాజు పిలుపునిచ్చారు. బుధవారం దేవరపల్లిలో జనసేన వాలంటీర్లతో సమావేశమై మాట్లాడారు. సభ్యత్వంలో కలిగే ప్రయోజనాలను ప్రతి ఒక్కరికి వివరించి అందరూ ఉద్యమి సభ్యత్వం తీసుకునే విధంగా కృషి చేయాలన్నారు.