VZM: గజపతినగరం మండలంలో విపరీతంగా పెరిగిన బెల్టు షాపులను అధికారులు తక్షణమే నియంత్రించాలని బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు ఎం.భాస్కరరావు అన్నారు. ఈమేరకు సోమవారం గజపతినగరం ఎస్సై కిరణ్ కుమార్ నాయుడుకు వినతి పత్రం అందజేశారు. పేదలు మద్యం సేవించడంతో ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడంతో పాటు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.