NTR: జనగణన-2027లో భాగంగా నందిగామ పట్టణంలో మే 1 నుంచి 31 వరకు ఇళ్ల జాబితా లెక్కింపు నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ జీ. లోవరాజు తెలిపారు. దీనికి సంబంధించి సూపర్వైజర్లు, ఎన్యుమరేటర్లకు రెండు విడతలుగా శిక్షణ ఇవ్వనున్నారు. తొలి విడత ఏప్రిల్ 15-17, రెండవ విడత ఏప్రిల్ 20-22 వరకు బాబు జగ్జీవన్ రామ్ భవన్లో జరుగుతుందని వెల్లడించారు.