E.G: గోకవరం మండలం భూపతిపాలెం ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ అభివృద్ధికి రూ. 20 లక్షల నిధులు మంజూరైనట్లు స్కూల్ పేరెంట్స్ కమిటీ ఛైర్మన్ గల్లా రాము బుధవారం తెలిపారు. జగ్గంపేట MLA జ్యోతుల నెహ్రూ ఈ నిధులను కేటాయించారు. ఈ నిధులతో స్కూల్ డార్మెట్రీకి వెళ్లే దారిలో సిమెంట్ రోడ్లు నిర్మిస్తామని ఆయన పేర్కొన్నారు. నిధులు మంజూరు చేసినందుకు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.