ASR: ముంచంగిపుట్టు మండలం కించయిపుట్టు పంచాయతీ పి.ఆర్ రోడ్డు నుంచి వరుకుగుమ్మి గ్రామం వరకు బీటీ రోడ్డు నిర్మాణ పనులు మండల టీడీపీ అధ్యక్షురాలు కిల్లో సన్యాసమ్మ సంధ్య ఇవాళ ప్రారంభించారు. దశాబ్దాలుగా రోడ్డు సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్న గ్రామాలకు కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా రహదారులు మంజూరు చేసి పనులు వేగవంతం చేస్తోందని నాయకులు తెలిపారు.