SKLM: ప్రస్తుతం ఇంటర్ పరీక్షలు జరుగుతుండగా పలు పరీక్ష కేంద్రాలను ఆర్జేడీ శేఖర్ బాబు బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రణస్థలం వెళ్లి పోలీస్ స్టేషన్లో ప్రశ్న పత్రాల పరిస్థితిని గమనించారు. అనంతరం శ్రీకాకుళం ఆర్ఐవో కార్యాలయాన్ని సందర్శించారు. ఆర్ఐవో సురేష్ కుమార్ డెక్ సభ్యులు శ్యామ సుందర్ ఆర్జేడీ శేఖర్ బాబును మర్యాదపూర్వకంగా కలిశారు.