CTR: తుమ్మిందపాళ్యంలో ఇవాళ ఓ యువకుడు దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. అందుకు సంబంధించిన వివరాలను పోలీసుల వెల్లడించారు. ఢిల్లీ బాబు వద్ద సాయికుమార్ రూ. 2 లక్షలు అప్పు తీసుకుని తిరిగి చెల్లించలేదు. అప్పు ఇవ్వలేదని అడిగే క్రమంలో ఏర్పడిన గొడవలో ఢిల్లీ బాబు సాయికుమార్ను నాటు తుపాకితో కాల్చాడు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.