ప్రకాశం: పామూరు పట్టణంలో కొత్త లైన్ పనులు జరుగుతున్న దృష్ట్యా ఇవాళ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఏఈ రసూల్ తెలిపారు. పట్టణంలోని విరువూరు రోడ్డు, ఎర్ర చేలు, కరెంటు ఆఫీసు కాలనీ, పాత స్టేట్ బ్యాంకు రోడ్డు ప్రాంతాలలో కరెంట్ నిలిపివేయనున్నారు. ఈ విషయాన్ని విద్యుత్ వినియోగదారులు గమనించి సహకరించాలని కోరారు.