SS: పుట్టపర్తిలోని కలెక్టర్ కార్యాలయంలో భూముల కేటాయింపుపై జిల్లా జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ.. భూముల అప్పగింత ప్రక్రియను నిర్దేశించిన గడువులోపు పూర్తి చేయాలని రెవెన్యూ అధికారులకు ఆదేశించారు. భూసేకరణలో ఉన్న అడ్డంకులను తొలగించి, సరిహద్దుల గుర్తింపు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.