AKP: ఉగాది సందర్భంగా అచ్యుతాపురం మండలం కొండకర్లలో నిర్వహించిన మండల స్థాయి చదరంగం పోటీలు శనివారం ముగిసాయి. ఈ పోటీల్లో తిమ్మరాజుపేటకు చెందిన పీ శ్రీనివాసరావు ప్రథమ స్థానం దక్కించుకున్నారు. ద్వితీయ స్థానంలో అనకాపల్లికి చెందిన కె తేజ, మూడవ స్థానంలో తిమ్మరాజుపేటకు చెందిన పీ నాగు, జూనియర్ విభాగంలో కౌశిక్, చైతన్య ప్రథమ ద్వితీయ స్థానం సాధించారు.