E.G: కొవ్వూరు టీడీపీ కార్యాలయంలో ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను తెలియజేస్తూ సుమారు 17 వినతి పత్రాలను అందజేశారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను శ్రద్ధగా విని, తక్షణ పరిష్కార దిశగా సంబంధిత అధికారులతో ఎమ్మెల్యే మాట్లాడారు.