KDP: ప్రొద్దుటూరులోని నూతన ఆర్టీసీ బస్టాండును ప్రయాణికులకు త్వరగా అందుబాటులోకి తేవాలని సంబంధిత అధికారులను స్థానిక ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి ఆదేశించారు. ఆయన శనివారం ఉదయం బస్టాండును పరిశీలించారు. పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. వాహనాల రాకపోకలకు వేరువేరుగా దారి ఏర్పాటు చేయాలన్నారు. అడ్డుగా ఉన్న డివైడర్లను తొలగించాలన్నారు.