VZM: ఐపీఎల్ క్రికెట్ సీజన్ నేపథ్యంలో క్రికెట్ బెట్టింగులు వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని బొబ్బిలి సీఐ కె.నారాయణరావు హెచ్చరించారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం పట్టణంలో యువకులు, విద్యార్థుల స్మార్ట్ ఫోన్లను పరిశీలించి చేసి బెట్టింగ్ యాప్లను తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. క్రికెట్ బెట్టింగులతో యువత, విద్యార్థులు జీవితాలను నాశనం చేసుకుంటున్నారన్నారు.