TPT: రేణిగుంట మండలం గాజులమండ్యం నుంచి తండలం వెళ్లే రహదారిపై నాగార్జున రెడ్డి సిమెంట్ రాయి ఫ్యాక్టరీ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. సుమారు 45 ఏళ్ల వయస్సు గల ఈ వ్యక్తి గ్రీన్-బ్లాక్ గళ్ల ఫుల్ షర్టు,బ్రౌన్ షార్ట్ ధరించి ఉన్నట్లు గుర్తించారు. శరీరంపై గాయాలు ఉండటంతో అనుమానాస్పద మృతిగా భావించి పోలీసులు కేసు నమోదు చేశారు.