కృష్ణా: మచిలీపట్నంలో బీసీవై పార్టీ జిల్లా కన్వీనర్ కోనా నాగార్జున శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బీసీ సింహ గర్జన జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. చట్టసభల్లో బీసీలకు 44 శాతం రిజర్వేషన్ కల్పించాలన్న లక్ష్యంతో ఈ సభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.