CTR: వీ.కోట బాయ్స్ హాస్టల్లో ఫుడ్ కార్పొరేషన్ ఛైర్మన్ విజయ ప్రతాపరెడ్డి సోమవారం తనిఖీలు నిర్వహించారు. విద్యార్థులకు అందిస్తున్న భోజన, వసతి సౌకర్యాలను ఆరా తీశారు. నిర్వాహన సక్రమంగా లేదని వార్డెన్కు షోకాజ్ నోటీస్ జారీ చేశారు. మెనూ ప్రకారం తప్పనిసరిగా భోజనం వడ్డించాలని ఆదేశించారు.