CTR: 10వ తరగతి పరీక్షలకు సంబంధించి పుంగరులో పగడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు MEO నటరాజ రెడ్డి తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. 16నుంచి ఏప్రిల్ 1 వరకు తేదీ వరకు పరీక్షలు జరుగుతాయని చెప్పారు. పట్టణంలోని 8 కేంద్రాలలో 1512 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే హాల్ టికెట్లను విద్యార్థులకు తమ పాఠశాలల్లో అందిస్తున్నట్లు తెలిపారు.