AP: సింహాచలం స్వామివారిని హోంమంత్రి అనిత దర్శించుకున్నారు. చందనోత్సవం, స్వామివారి కల్యాణోత్సవం నేపథ్యంలో ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. ఈసారి భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. అలాగే, గ్యాస్ సంక్షోభం లేకుండా ప్రభుత్వం అప్రమత్తమైందని చెప్పారు. సీఎం చంద్రబాబు అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. దయచేసి వదంతులను నమ్మొద్దని సూచించారు.