MBNR: జర్నలిస్టుల సంక్షేమం, వారి కుటుంబాల ఆరోగ్య భద్రతకు కట్టుబడి ఉంటానని ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి తెలిపారు. శనివారం దేవరకద్రలో టీయూడబ్ల్యూజే ప్రతినిధులు ఆయనను కలిసి హెల్త్ కార్డుల సమస్యపై వినతిపత్రం ఇచ్చారు. ప్రభుత్వ సహాయంతో పాటు తన వంతుగా ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఎమ్మెల్యే ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.