యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబోలో ‘డ్రాగన్’ మూవీ రాబోతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే జోర్డాన్లో కీలకమైన యాక్షన్ సన్నివేశాలను పూర్తి చేసుకున్న చిత్రబృందం.. కొత్త షెడ్యూల్ను మార్చి 20 నుంచి స్టార్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం హైదరాబాద్లో భారీ సెట్ను సిద్ధం చేసినట్లు సమాచారం.