TG: కేంద్ర మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రిని మంత్రి సీతక్క కలిశారు. నిర్భయ నిధి కింద ములుగు జిల్లాను కేంద్రం ఎంపిక చేయడంపై కృతజ్ఞతలు తెలిపారు. ములుగు జిల్లాలో మహిళలు, బాలికలకు భద్రత, గౌరవం పెరుగుతాయని సీతక్క పేర్కొన్నారు. అత్యవసర ప్రతిస్పందన వ్యవస్థలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ప్రాజెక్టును అమలు చేసేందుకు డీపీఆర్ తయారు చేస్తున్నట్లు వివరించారు.