కృష్ణా: మచిలీపట్నం నుంచి పెడన వెళ్లే NH-216 హైవేపై ట్రాఫిక్ సీఐ ఎన్.రాజు హెల్మెట్ వినియోగంపై వాహనదారులకు గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ధరించడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి వివరించారు. రోడ్డు ప్రమాదాల సమయంలో ప్రాణ నష్టం జరగకుండా ఉండేందుకు హెల్మెట్ ఎంతో కీలకమని తెలిపారు.