ATP: రాష్ట్ర వక్ఫ్ బోర్డు ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘తాలీం-ఏ-హునర్’ టాలెంట్ టెస్ట్ ఫలితాల్లో అనంతపురం జిల్లాకు చెందిన షేక్ మకాందర్ నయీమా సాధియ రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకు సాధించింది. ఈ పరీక్షలో ఆమె 360 మార్కులకు గాను 272 మార్కులు సాధించి టాపర్గా నిలిచింది. ఈ ఘనత సాధించిన విద్యార్థినిని పలువురు అభినందించారు.