BPT: వెదుళ్లపల్లిలో జరిగిన ఇనుప గేట్ల చోరీ కేసును ఎస్సై భాగ్యరాజు ఛేదించారు. ఫిబ్రవరి 12న వెంకటేశ్వరరెడ్డి ఇంటి వద్ద చోరీకి గురైన రెండు గేట్లపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేపట్టి నిందితులను శనివారం గుర్తించారు. ఈ చోరీకి పాల్పడిన A1 సంగీత రంజిత్ కుమార్, A2 ఆసోడి సాయిబాబులను పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఎస్సై తెలిపారు.