నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి సాగునీటి అవసరాల కోసం ప్రధాన కాలువ ద్వారా 4వ విడతలో భాగంగా, 1200 క్యూసెక్స్ నీటిని ఈ రోజు మధ్యాహ్నం 12:30 గంటలకి విడుదల చేయడం జరుగుతుందని ప్రాజెక్టు నిర్వాహకులు తెలిపారు. కాలువల పరిసర ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలు, రైతులు, పశుపాలకులు అప్రమత్తంగా ఉండాలని, కాలువలోకి లేదా కాలువ ఒడ్డుల సమీపానికి వెళ్లొద్దని సూచించారు.