SKLM: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ‘వీబీ జీ రామ్జీ’ చట్టంపై జిల్లా వ్యాప్తంగా అవగాహన కల్పించనున్నట్లు డ్వామా పీడీ బీ. లవ రాజు శుక్రవారం ప్రకటనలో తెలిపారు. నేటి నుంచి ఆరు వారాల పాటు జిల్లాలోని పలు గ్రామాల్లో ‘జన్ -సంవాద్’ పేరుతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.