E.G: అర్హులందరికీ సంక్షేమాన్ని అందించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. బుధవారం కడియం మండలం వీరవరం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా పూర్తిగా మంచాన పడిన అర్హురాలికి 15 వేల రూపాయల పెన్షన్ పంపిణీ చేశారు.