MHBD: పట్టణ కేంద్రంలోని ‘ఓం శ్రీమన్నారాయణ చిట్ ఫండ్’ పేరుతో ప్రజలను మోసం చేసిన మంగీలాల్, అతడి భార్య సావిత్రిపై కేసు నమోదు చేసినట్లు టౌన్ CI మహేందర్ రెడ్డి తెలిపారు. భాధితుల నుండి సుమారు రూ. 80 లక్షలు వసూలు చేసి.. తిరిగి ఇవ్వకుండా బాధితులను వేధిస్తున్నట్లు CI పేర్కొన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు CI వెల్లడించారు.