కోనసీమ: అమలాపురం వాస్తవ్యులు గంచి పుత్రమాల్ వారి కుటుంబ సమేతంగా మంగళవారం అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి వారిని దర్శించి విఘ్నేశ్వర అన్నప్రసాద ట్రస్ట్ నకు విరాళంగా రూ.51,111 లు సమర్పించినారు. వీరికి ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం అందజేసి శేష వస్త్రములతో సత్కరించారు. ఆలయ కార్యనిర్వాహణాధికారి వారు స్వామి వారి చిత్రపటం అందజేశారు.