కోనసీమ: రామచంద్రపురం పురపాలక సంఘం ఛైర్ పర్సన్ గాదంశెట్టి శ్రీదేవి ఆధ్వర్యంలోని పాలకవర్గ పదవీకాలం నేటితో ముగియనుంది. ఈ సందర్భంగా మున్సిపల్ అత్యవసర సమావేశం నిర్వహించనున్నట్లు కమిషనర్ రాజు ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొని పాలకవర్గ సభ్యులను ఘనంగా సన్మానించి, అభినందించనున్నారు.