KDP: టి.కోడూరు గ్రామంలో పోలీసుల ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ కార్యక్రమం నిర్వహించారు. కొండాపురం సీ.ఐ రాజా మాట్లాడుతూ.. గ్రామంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రౌడీ షీటర్లు, ట్రబుల్ మాంగర్లు సత్ప్రవర్తనతో జీవించాలని సూచించారు. గంజాయి, మత్తు పదార్థాలు మరియు మహిళలపై నేరాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవు అన్నారు.