KDP: పులివెందులలో ప్రజాపిత బ్రహ్మ కుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం వారి విశ్వశాంతి భవన్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఉద్ఘాటన వేడుకల్లో ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం రాజయోగిని జయంతితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.