ASR: ప్రధాన రహదారుల వెంట నిర్వహిస్తున్న చేపలు, మాంసం దుకాణాలను ప్రభుత్వం కేటాయించిన సంత మార్కెట్ ప్రాంగణానికి తప్పనిసరిగా తరలించాలని చింతపల్లి ఎంపీడీవో సీతామహాలక్ష్మి హెచ్చరించారు. కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశాల మేరకు ఇప్పటికే నోటీసులు జారీ చేసి, లాటరీ విధానంలో స్థలాలు కేటాయించినప్పటికీ కొందరు వ్యాపారులు మొండి వైఖరి ప్రదర్శిస్తున్నారని ఆమె తెలిపారు.