ప్రకాశం: కంభం మండలం రావిపాడు గ్రామంలో మద్యం మత్తులో తిరుగుతున్నాడని అడపాల గోపాల్ అనే వ్యక్తిని గ్రామస్తులు కొందరు చితకబాదారు. దీంతో గోపాల్కు గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం కంభం ప్రభుత్వ వైద్యశాలకు తీసుకొని వెళ్ళగా డాక్టర్ ప్రథమ చికిత్స చేసి చెవుల నుంచి రక్తం వస్తున్నదని, మెరుగైన వైద్యం కోసం మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలకు పంపారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.