అన్నమయ్య: గాలివీడు మండలం పందికుంట గ్రామం వెంకటాపురంలో నూతనంగా నిర్మించిన వేంకటేశ్వర స్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సోదరుడు మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం దేవాలయాల అభివృద్ధికి ప్రత్యేక చొరవ తీసుకుంటుందని తెలిపారు.