అన్నమయ్య: జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సోమవారం తాగునీటి సమస్యను పరిష్కరించాలని సీపీఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. సీపీఐ జిల్లా కార్యదర్శి మహేష్, నియోజకవర్గ కార్యదర్శి సిద్ధిగాళ్ల శ్రీనివాసులు నేతృత్వంలో జరిగిన ఈ ఆందోళనలో స్థానిక మహిళలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు.