CTR: కాణిపాకంలో ఉగాది సంబరాలు అంబరాన్ని తాకాయి. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ కళ్యాణ వేదికపై సిద్ధి–బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామివారికి ప్రత్యేక పూజలు, పంచాంగ శ్రవణం వైభవంగా నిర్వహించారు. పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ ముఖ్య అతిథిగా విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. పండితులు నూతన సంవత్సర ఫలితాలను వివరించగా, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తరించారు.