ELR: జంగారెడ్డిగూడెం గ్రామదేవత గంగానమ్మ అమ్మవారి ఆలయంలో బుధవారం పరాభావ నామ సంవత్సర ఉగాది పండుగ శోభ సంతరించుకుంది. ఈ సందర్భంగా అమ్మవారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అలాగే అమ్మవారికి విశేష పూజా కైంకర్యాలను ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపించారు. అనంతరం భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.