ప్రకాశం: పొదిలి ప్రధాన రహదారిలోని మహా లక్ష్మమ్మ అరుగు వద్ద ఆగి ఉన్న బైక్ను మరో బైక్ వచ్చి ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆగి ఉన్న బైక్పై ఉన్న తండ్రీకూతురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వారిని వెంటనే ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఒంగోలు తరలించినట్లు స్థానికులు తెలిపారు.