ATP: రాయదుర్గంలోని సీపీఐ కార్యాలయంలో మంగళవారం అఖిల భారత మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మహిళా సమాఖ్య జెండాను ఆవిష్కరించిన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మావతి మాట్లాడుతూ.. మహిళల భద్రత, సమాన హక్కుల విషయంలో ప్రభుత్వాల వైఫల్యాన్ని ఎండగట్టారు. పెరిగిపోతున్న దాడులను అరికట్టడంలో పాలకులు విఫలమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.