ATP: తాడిపత్రి నియోజకవర్గంలో వైద్య ఖర్చుల కోసం ఇబ్బందులు పడుతున్న 35 కుటుంబాలకు MLA జేసీ అస్మిత్ రెడ్డి ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కులు పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం నుంచి మంజూరైన రూ.18,94,242 నిధులను లబ్ధిదారులకు అందజేశారు. ఇప్పటి వరకు నియోజకవర్గంలో 526 మందికి రూ.3,94,43,766ల మేర ఆర్థిక సాయం అందించినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు.