ELR: జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్, ఆర్డీఓ కిషోర్, మంగళవారం పెదనిండ్రకొలనులో పర్యటించారు. గ్రామంలో హౌసింగ్ కాలనీ పాత లే ఔట్, కొత్త లే ఔట్లను పరిశీలించారు. లబ్ధిదారుల కోరిక మేరకు 2 లే ఔట్లను ఒకే లే అవుట్ గా బదిలీ చెయ్యడానికి ప్రపోజల్స్ సిద్ధం చేశారు. వారి వెంట తహశీల్దార్ బొడ్డేపల్లి దుర్గాప్రసాద్, డీటీ, వీఆర్ఓలు ఉన్నారు.