SKLM: జిల్లా అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ పరిశీలకుడిగా పిన్నింటి సాయికుమార్ను నియమించారు. ఈ మేరకు మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు తాడేపల్లి కేంద్ర కార్యాలయం శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. తనపై నమ్మకం ఉంచిన జగన్కు, జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణ దాస్కు సాయి కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.