మార్కాపురం మండలం తిప్పాయపాలెం గ్రామ సచివాలయాన్ని తహసీల్దార్ చిరంజీవి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాజరు పట్టికలు, రికార్డులను పరిశీలించగా వెల్ఫేర్ అసిస్టెంట్ ముందస్తు అనుమతి లేకుండా గైర్హాజరైనట్లు గుర్తించారు. సచివాలయ సిబ్బంది సమయపాలన పాటించాలన్నారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ విజయ సునీతకు నివేదికను అందిస్తున్నట్లు తెలిపారు.