VZM: వీరభద్రపురం, నరపాం సహా ఏడు గ్రామాల ప్రజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించుకునే వెదుళ్ల పైడిమాంబ అమ్మవారి జాతరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సోమవారం నుంచి ఈ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇవాళ అమ్మవారి తోలేళ్లు, మంగళవారం అనుపోత్సవం వైభవంగా నిర్వహిస్తామని ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. భక్తుల కోసం అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.