ELR: తేలప్రోలు – నూజివీడు మధ్య కోడూరుపాడు మూసివేసిన రైల్వే గేటు సమీపంలో సుమారు 35 ఏళ్ల వ్యక్తి మృతదేహాన్ని గుర్తించినట్లు ఏలూరు రైల్వే ఎస్సై కృపాదానం తెలిపారు. రైలు నుంచి ప్రమాదవశాత్తు పడి మరణించినట్లు పేర్కొన్నారు. మృతుడు 5.5 అడుగుల ఎత్తు, వంకాయ రంగు చొక్కా, బ్లూ జీన్స్ ధరించి ఉన్నాడు. మృతుడి వివరాలకు రైల్వే పోలీసులను సంప్రదించాలని కోరారు.