ప్రకాశం: ఈ నెల 18వ తేదీన సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదగా దివ్యాంగ శక్తి పథకం ప్రారంభించనున్నట్లు మంత్రి స్వామి మంగళవారం తెలిపారు. స్త్రీ శక్తి పథకం వర్తించే అన్ని బస్సుల్లోనూ రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. దివ్యాంగులు వెంట వచ్చే సహాయకులకు ఛార్జీలు 50 శాతం రాయితీ ఉంటుందన్నారు.