BPT: బుద్దాం గ్రామంలో గురువారం అకాల వర్షం ఓ రైతును నిండా ముంచింది. ఆకస్మికంగా పడిన పిడుగుకు ఓ వరి కుప్ప పూర్తిగా దగ్ధమైంది. గ్రామానికి చెందిన నర్రా నాగరాజు ఎకరం 20 సెంట్ల పొలంలో పండించిన ధాన్యాన్ని కుప్పగా వేశాడు. పిడుగు పడటంతో ఆరుగాలం పడిన కష్టం కళ్లెదుటే కాలి బూడిదైంది. చేతికొచ్చిన పంట కాలిపోవడంతో ఆ రైతు తీవ్ర ఆవేదన చెందుతున్నాడు.