ప్రకాశం: మర్రిపూడి మండలం రాజుపాలెం గ్రామంలో కందుల కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం మర్రిపూడి ఎంపీపీ వాకా వెంకట రెడ్డి ప్రారంభించారు. ఈ కేంద్రం వల్ల రైతులకు ఎంతో ఉపయోగం ఉంటుందని ఆయన అన్నారు. ఈ కొనుగోలు కేంద్రం రైతుల సంక్షేమానికి దోహదపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు మండల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.